Home » kaleshwaram
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారట.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ దృష్టి సారించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో (Kaleswaram project) జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ (Justice Chandra Ghosh) విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించారు.
వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్ గ్రౌటింగ్, సిమెంట్ అడ్మిక్చర్ గ్రౌటింగ్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకోనుంది. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి విదితమే.
మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో సీఎ్సఎంఆర్ఎ్స(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నారు.