Home » Minister Narayana
విశాఖలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ సదస్సులో మంత్రి పాల్గొని.. ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ నేడు విశాఖకు చేరుకున్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు కొనసాగాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్కు పరిశ్రమలు ఎంతో కీలకమని చెప్పారు.
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలని పునర్విభజించిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లాలు పునర్విభజించిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఇంజనీరింగ్ , పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మంత్రి నారాయణ. తాగు నీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. కాలుష్య నివారణ , సోలార్, గ్రీన్ ఎనర్జీ, సూర్య ఘర్ వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.
గూడూరుకు రూ.73 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
అమరావతి నిర్మాణం గురించి మలేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.