Home » Minister Narayana
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
హైడ్రా తరహా సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేస్తే తరువాత పరిణామాలు ఎలా ఉండవచ్చనే చర్చ మొదలైంది. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాచేసి నిషేధిత ప్రాంతంలో నిర్మించిన కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో..
ఆంధ్రప్రదేశ్లో అనధికార లే అవుట్లపై మున్సిపల్ శాఖ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేని లే అవుట్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
ప్రజలకు క్యాన్సర్పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వైసీపీ(YSRCP) హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ(Minister Narayana) ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Andhrapradesh: రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అన్న క్యాంటీన్లను ఆగస్టు15వ తేదీన ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.
టౌన్ ప్లానింగ్లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.