Home » Minister Narayana
దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డో లో గ్రీన్ స్పేస్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్ను భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్షజాతులతో అద్భుతంగా పార్క్ను నిర్మించారు.
ఫ్యూచర్ సిటీస్లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం, సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు.
దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు.
భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు.
2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని మంత్రి నారాయణ గుర్తుచేశారు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామన్నారు.
జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.
డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.
అమరావతిపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. 2014, 2019లో రూ. 9 వేల కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం అయ్యిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో అనేక సమస్యల్ని పరిష్కరించిందని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.
మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని ఆయన అన్నారు.