Home » MLC Kavitha
ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ మహిళా మణులకు గుర్తింపు ఏదని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో పర్యటిస్తానని బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటానని అధైర్యపడవద్దని కవిత చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. కులగణనలో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని వివరాలు నమోదు చేయించుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్గా హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.