Home » National News
హై రేంజ్ రూరల్ డవలప్మెంట్ సొసైటీ (హెచ్ఆర్డీఎస్) అనే సంస్థ 'ది వీర్ సర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ -2025'ను నెలకొల్పింది. తొలి అవార్డు గ్రహీతగా శశిథరూర్ పేరును ప్రకటించింది.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.
భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్తే భక్తులు ఉరక్కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వా్మిని దర్శించుకుంటారని, పండితావళానికి సుమారు 400 మీటర్ల దూరంలోని ఈ జలపాతం వద్ద తరచు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాలకృష్ణన్ తెలిపారు.
అడ్వకేట్ కిషోర్పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.
మహారాష్ట్రలోని భండారా జిల్లా ధనోరి గ్రామం సమీపంలోని గోసిఖుర్డ్ ఆనకట్టు కాలువలో తీవ్రంగా గాయపడి ఉన్న పులిని చూసి గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. పెద్ద పులిని సురక్షితంగా తరలించి చికిత్స అందించేందుకు పశువైద్య సిబ్బంది రంగంలోకి దిగింది.
వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై చర్చ ఎందుకని కొందరు సభ్యులు ప్రశ్నిస్తున్నారని, అయితే కాలంతో సంబంధం లేకుండా దేశప్రజల్లో వందేమాతరం ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉందని అమిత్షా అన్నారు.
శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పరారయ్యారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.