Home » Nellore
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు ఉద్రిక్తతల నడుమ సాగాయి. అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తించారు. టీడీపీ ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్లు ఇలా రకరకాలుగా బెదిరింపు చర్యలు పాల్పడ్డారు అధికారపార్టీ నేతలు. పోలింగ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్ఆర్కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.
టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు.
నెల్లూరు పార్లమెంట్లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.
సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..
ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ.. 25 లోక్సభ సీట్లు తప్పకుండా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా వైసీపీ (YSRCP) ఓటమి గాలి వీస్తోందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి(జగన్) శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ఈ నెల 13న జరుగుతుండటంతో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పలు కుట్రలకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు జగన్ పార్టీకి తొత్తులుగా మారారనే ఆరోపణలు వస్తున్నాయి.
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.