Home » Nellore
Kakani Arrest:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.
Kavali CI Overaction: జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.
నెల్లూరు జిల్లా ఆమంచర్లలో బంధువు ఏడాదిగా 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిగా తేలడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.
Kakani: క్వార్జ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు.
ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందు కోసం కౌంట్డౌన్ శనివారం ఉదయం ప్రారంభైంది.
రూ.8,500 కోట్లతో అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్లో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Police Hunt For Kakani: రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి కాకాణి. హైదరాబాద్, బెంగళూరులో కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.