Home » Nepal
నేపాల్ రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ, ప్రధాని కేపీ శర్మ ఓలీ అనూహ్యంగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నేపాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితులు మారుతున్న క్రమంలో భారత విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ విడుదల చేసి సూచనలు జారీ చేసింది.
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తీసుకున్న సోషల్ మీడియా నిషేధ నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 347 మందికి పైగా గాయాలయ్యాయి.
హిమాలయ దేశం నేపాల్లో రాజధాని నగరం కఠ్మాండూ సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు, వేల సంఖ్యలో యువత గళమెత్తింది...
రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అందజేశారు. యువత ఆందోళనలపై ప్రధాని అత్యవసరంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో హోం మంత్రి తన రాజీనామా అందజేసినట్టు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు.
నేపాల్ మారణకాండకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నేపాల్ పార్లమెంట్ గేట్ మంటల్లో తగలబడిపోతూ ఉంది.
నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో నేపాల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి నివాసాలతో పాటు బలువతార్లోని ప్రధానమంత్రి నివాసం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. దాదాపు 100 మంది వరకూ గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. యువత నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సరిహద్దు ప్రాంతమైన లిపూలేఖ్ పాస్ మీదుగా భారత్తో వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ లేవనెత్తిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇది భారత్, నేపాల్కు చెందిన ద్వైపాక్షిక అంశమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కాలాపానీ ప్రాంతం తమదని, ఈ ప్రాంతం మీదుగా భారత్-చైనా వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్ స్పందించింది. ఇది నిరాధారం వాస్తవ దూరమని స్పష్టం చేసింది. చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.