Home » New Delhi
కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ఫోరెక్స్ నిల్వలు చాలా పటిష్టంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా లక్షలాది మంది దేశీయ పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు ఎస్ఐపీ ద్వారా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారని మోదీ తెలియజేశారు.
ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, భారీ వర్షాలకు, రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటే అవకాశం ఉన్నందున ప్రజలు లోతత్తు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి గాంధీనగర్లోని ట్రేడర్లతో గొడవపడ్డాడు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రతివారం నిర్వహించే జన్ సున్వాయి ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఒక వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. .
విపక్ష కూటమి నిర్ణయంతో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీని డైలమాలో పడేసే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ప్రకటించింది.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సరళ స్వభావి, నిబద్ధత కలిగిన నేత అని రాధాకృష్ణన్ను ప్రశంసించారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.
లోక్సభలో ఇవాళ ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలడిగితే దేశ ప్రజలకు..