Home » Peddapalli
రామగుండం పునర్ నిర్మాణ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, రామగుండం నగరాన్ని బిజినెస్, మెడికల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం మెయిన్ చౌరస్తాలో సింగరేణి ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ప్రభుత్వం ఏర్ప డితే రెండు రోజుల్లోనే ఇసుక లారీలను నిలిపివేస్తా మని ఇచ్చిన మాటాను మంత్రి మరిచారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషిరవీందర్ ప్రశ్నిం చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుకను బంద్ చేస్తామని హామీఇచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇసుక లారీలు నడుస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెల ల్లోనే ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు వచ్చాయని ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు అన్నారు. సోమవారం అంకంపల్లెలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపో శారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.
చట్ట పరిధిలో పోలీసుల ను ఆశ్రయించే సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే బాధి తులు నేరుగా కలువాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అం బర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం కమి షనరేట్లో కమిషనర్గా బాధ్య తలు స్వీకరించారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఎల్ఆర్ఎస్ కాకుండా అక్ర మ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ ఎస్పై అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ లేఅవుట్ క్రమబద్ధీకరణ 2020 పథ కం కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి ఫీజుతోపాటు ఓపెన్ స్పెస్చార్జిలను మార్చి 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంద న్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వ హణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఈవో డి.మాధవి, కలెక్టరేట్ సూపరిం టెండెంట్ ప్రకాష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వ హణపై సంబంధిత అధికారులతో సమీ క్షించారు. డీఈవో మాధవి మాట్లాడుతూ ఈనెల 21నుంచి ఏప్రిల్ 4వరకు పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతాయని, అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
చిన్న తప్పిదంతో అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంటోంది. మార్చిలోనే ఎండల తీవ్రత పెరి గింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా సంభవి స్తాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదముంది. భూగర్భ జలాలు అడుగంటడంతో అగ్ని ప్రమాదాలను నివారించడం సవాల్గా మారింది.
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పెయిడ్ గదులు సౌకర్యం ఏర్పాటు చేశారు. సాధారణ వార్డుల్లో ఉండలేని రోగులు ఆర్థిక స్థోమత గల వారు పెయిడ్ గదులను తీసుకుంటున్నారు. ఈ పెయిడ్ గదులతో యేటా లక్షల రూపాయల్లో ఆదాయం సమకూరుతోంది. 2022లో గదులను ప్రారంభించారు. జిల్లా ప్రధానాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా పెయిడ్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సుల్తానాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు సమావేశం నిర్వహించారు. సంజీరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఘన విజయం సాధించడం గర్వకారణమన్నారు.
మహిళల హక్కుల పట్ల అవగాహన పెంచుకున్నపుడే ధైర్యంగా ముందుకు పోవచ్చని మంథని అడిషనల్ సివిల్ జడ్జి మూల స్వాతిగౌడ్ అన్నారు. స్థానిక కోర్టులో అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.