Home » Peddapalli
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
రాత్రి మిల్లులో నిద్రిస్తుండగా కరెంట్ పోవడంతో ఉక్కబోత భరించలేక తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆరుబయటకొచ్చి నిద్రకు ఉపక్రమించడమే ఆ దంపతుల తప్పయింది! తల్లి చుట్టూ చేతులేసి హాయిగా నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ దుండగుడు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్-కాట్నపల్లి మధ్య రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లు వద్ద ఈ ఘోరం జరిగింది.
భూమి పంపకాల వివాదం.. ఓ ప్రాణాన్ని బలిగొంది. దాయాదుల ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంచిన్నపొర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన సంజప్ప(28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
ప్రముఖ అంతర్జాతీయ శీతల పానీయాల కంపెనీ కోకా కోలా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ కంపెనీ ప్లాంట్ ఉండగా.. విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో రూ.700 కోట్ల పెట్టుబడులు
ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి తనయుడు రఘురాంరెడ్డి 4.62 లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. సురేందర్రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా.. తండ్రి రాజకీయ నేపథ్యం.. నేతల బంధువుత్వం సురేందర్ రెడ్డికి కలిసి వచ్చింది.
లోక్సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ ఖిల్లా మెదక్లోనూ కమలం వికసించింది.
రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
త ప్రభుత్వం చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాల తాలూకు విపరిణామాలు ప్రస్తుత ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆదాయమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన ఇసుక తవ్వకాలపై ఇప్పటికే రాష్ట్ర నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖలకు చెనైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ కోర్టు రూ.25 కోట్ల చొప్పున తాత్కాలిక జరిమానా విధించడం తెలిసిందే.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది.
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్హౌ్సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.