Home » Peddapalli
మంథని పట్టణంలోని ధనలక్ష్మి జ్యువెల్లరీ యజమాని సుమారు కోటిన్నర రూపాయలకు పైగా ప్రజలనెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యాడు. వ్యాపారిని నమ్మి అప్పులు ఇచ్చిన వారిని, తక్కవ ధరకే బంగారం, వెండి ఇస్తానంటే నమ్మిన వారిని, వివాహ ఆభరణాలు తయారీకి బంగారం ఇచ్చిన వారికి షాపు యజమాని, కుటుంబ సభ్యులు కోటిన్నరకు పైగా ఎగవేసినట్లు శనివారం బహిర్గతమైంది.
పేదలకు వైద్యం అందించడంలో వైద్య విద్యార్థులు ముందుండాలని సింగరేణి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రిన్సిపాల్ హిమబిందు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పెద్దపల్లిలో నిర్మించిన సఖి కేంద్రం భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ పట్టణం లో విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ సఖీ కేంద్ర భవన నిర్మాణం పూర్తయిందని, ప్రజాప్రతినిధుల సమయం తీసుకుని త్వర లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అం దించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కోనరావుపేటలో శుక్రవా రం ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.
ఆర్ఎఫ్సీఎల్లో శుక్రవారం మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె జరిగింది. ఉదయం గేటు వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్తో సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికులు మిశ్రమంగా స్పందించారు.
ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు నియోజకవర్గం లో దళారీ వ్యవస్థకు తావు లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని శానగొండ, గొల్లపల్లిలో బుధవారం పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మిం చనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
విద్యాబద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాఠాలు బోధించ కుండా జై భీం అనాలంటూ నిత్యం విద్యార్థులను వేధిస్తున్నారని, ఆ మాష్టారు వద్దంటూ విద్యార్థులు ఆందోళన చేసిన సంఘటన మండలం లోని నిట్టూరు గ్రామంలో చోటుచేసుకుంది. నిట్టూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్ కొంతకాలంగా విద్యార్థులపట్ల వివక్ష చూపి స్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలు మార్లు చెప్పినా వినక పోవడంతో బుధవారం విద్యార్థులు తల్లిదం డ్రులతో కలిసి పాఠ శాలకు తాళం వేశారు. పాఠశాల ఎదుట విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు బైఠాయించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను నిలబెట్టుకుని కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్మికులతో కలిసి కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు.
బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు కందుల సతీష్, రాజ్కు మార్, హరినాథ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎన్టీపీసీ యాష్ పాండ్ పరిసర ప్రాంతాలైన లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, గుంటూ రుపల్లి, ఎల్కలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎఫ్సీఐలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇంటర్మీడియట్ పరీక్షల కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 23సెంటర్లలో పరీక్షలు బుధవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు, నిర్వహించ నున్నట్లు నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.