Home » Peddapalli
దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మానకొండూర్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
పెద్దపల్లి లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2004 నుంచి ఎంపీ అభ్యర్థి మారుతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వడం లేదు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ బరిలోకి దిగారు. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 200 ఎంపీ సీట్ల కంటే మించి రావని బీఆర్ఎస్ అధినేతచ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) అన్నారు. శుక్రవారం రామగుండంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జిల్లాల్లో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..
Telangana BJP MP Candidates: లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ(BJP).. ఆ సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా బీజేపీలో పెద్దపల్లి(Peddapalli) టికెట్కు సబంధించిన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువుండడంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు కొత్త పథకాలు తీసుకువస్తున్నామని చెప్పారు.
ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం మంథనిలో రాహుల్ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాదు, రాజులా వ్యవహరిస్తున్నారని.. కేసీఆర్ కుటుంబ సభ్యులకే న్యాయం జరుగుతోందన్నారు.
: రామగుండంలో అధికార పార్టీ బీఆర్ఎసకు గట్టి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చందర్ తమ కాళ్ళు పట్టుకున్నారన్నారు. కోరుకంటి చందర్ను 2018 లో చందాలు వేసుకొని గెలిపించామని చెప్పుకొచ్చారు.
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అదే విధంగా ఆ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వచ్చింది. అయితే అదే వారికి చివరి రాఖీ అవుతుందని ఆ చెల్లెలు, అన్నా ఊహించలేకపోయారు.