Home » Peddapalli
రామగుండం నియోజకవర్గంలో ఉచిత ఇసుక సరఫరా నిలిచిపోయింది. నాలుగు నెలల క్రితం జిల్లా యం త్రాంగం గోదావరి నది నుంచి ఇసుక తీయకుండా ర్యాంపులకు అడ్డంగా కందకాలు తవ్వింది. ఇసుక పక్కదారి పడుతుందనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ సీరియస్గా స్పందించి గోదావరి నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్లే రీచ్లను మూసివేయించారు.
గోదావరిఖని ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రాన్ని సంకల్ప ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, వైద్యాధికారి లక్ష్మీభవాని, వెంకటేశ్వర్లు, డీహెచ్ఎంవో వాణిశ్రీ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని నవజాత శిశువుల చికిత్స విధా నాన్ని పరిశీలించారు.
పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది. శనివారం నామినే షన్ల పరిశీలన, 9న అభ్యర్థుల ఉపసంహరణ జరగనుంది. సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో నామిని రాజిరెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఈనెల 17న పోలింగ్ జరగనుంది. మండలాల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీపీసీ జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ గురువారంతో ముగిసింది. దీనికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ విద్యా ర్థులు శాస్ర్తీయ ఆలోచన బేష్గా ఉందని, సృజనాత్మక ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.
పంచాయతీ ఎన్ని కలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పాల్గొ న్నారు.
రామగుండాన్ని సింగరేణి సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొ న్నారు. రెండేళ్ల పాలన, రామగుండంకు 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం మంజూరు సందర్భంగా గురువారం రాత్రి మెయిన్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.
పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి అన్నారు
అంగవైక్యలం శరీరానికే కానీ, మనసుకు కాదని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. బుధవా రం జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో నిర్వ హించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
అభ్యంతరాల పరి ష్కారం తర్వాతే బైపాస్ రోడ్డు భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం అప్పన్నపేట గ్రామంలో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం చేపట్టిన ఎంజాయింట్ సర్వే ప్రక్రియను కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.