Home » Phone tapping
విదేశాల్లో ఉన్న ఫోన్ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్రావు(ఏ1), శ్రవణ్రావు(ఏ2)లపై రెడ్కార్నర్ నోటీసు జారీ చేయడానికి ఆలస్యమెందుకని హైకోర్టు పోలీసులను నిలదీసింది.
ఫోన్ట్యాపింగ్ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావుకు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం విషయం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీష్రావుపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును సీరియస్గా విచారణ చేపట్టారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
కాంగ్రెస్ నేత, చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసిపి ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది.
Telangana: ‘‘నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారు’’ జైపాల్ యాదవ్ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.