Home » PM Modi
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్లోని దర్బంగాలో గత నెలలో కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేపాల్ కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సుశీల కర్కిని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శనివారం ఉదయం అభినందించారు. పొరుగుదేశాలతో శాంతి, ప్రగతి, ప్రజల అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
చురాచంద్పూర్లో రూ.7,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో మణిపూర్ అర్బన్ రోడ్లు, డ్రైనేజీలు, అస్సెట్ మేనేజిమెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రాజెక్టు, 5 నేషనల్ హైవే ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డవలప్మెంట్ (MIND) ప్రాజెక్టు, తొమ్మిది ప్రాంతాల్లో వర్కింగ్ ఉమన్ హాస్టళ్లు ఉన్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నేపాల్లో కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రధాని మోదీ మణిపూర్ సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మిజోరం, మణిపూర్, అసోం, పశ్చిమ బెంగాల్....
దేశానికి నాలుగోసారీ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఒక సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలని..
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.