Home » Puducherry
టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
డీఎంకే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవదు.. మోసపోవద్దు.. అని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో వస్తుంటారని, కానీ ఓటర్లు నమ్మవద్దన్నారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.
సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి.
పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ కైలాశ్నాథ్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి..
కొవిడ్పై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ముందు జాగ్రత్తతోనే కోవిడ్ను ఎదుర్కోగలమని ఆయన అన్నారు.
మద్యం ప్రియులు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ప్రభుత్వం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరుకు రూ.10, క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు పెంచింది. పెరిగిన ఈ రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి మాత్రం ఓ సాధారణ వ్యక్తిగా కారులోనే భోజనం చేశారు. సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపించి అందులోనే భోజనం చేశారు.
తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కృష్ణగిరి జిల్లాలో గత 14 గంటల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది.