Home » Raptadu
‘‘కొడకల్లారా.. టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! ఉంటే వైసీపీలో ఉండండి. లేదంటే ఊరు విడిచి వెళ్లండి..! పరిటాల వాళ్లు ఇక్కడికి ఎలా వస్తారు..?’’ ఇదీ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్..! తమ స్వగ్రామం తోపుదుర్తిలో అనుచరులతో కలిసి ఆయన భయానకవాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు....
అనంతపురం జిల్లా: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం ప్రదర్శించారు. అర్ధరాత్రి తోపుదుర్తి గ్రామంలో తన అనుచరులతో అలజడి రేపారు. తోపుదుర్తి గ్రామంలో టీడీపీ నేత బోయ లింగమయ్య, ఉరుముల వన్నూరుప్ప ఇంటిపై దాడి చేశారు.
అనంతపురం: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా, రాప్తాడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు అధికార పార్టీవాళ్లు బెదిరించారని.. కేసులు పెట్టారని.. ఇవాళ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Praja Galam At Raptadu: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో బాబు ప్రసంగిస్తున్నారు. వైసీపీ, జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జగన్ చేసిన తప్పొప్పులను ఒక్కొక్కటీ ఎత్తిచూపిస్తూ మరీ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు బాబు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..
YSRCP Attack On Andhrajyothy Photo Grapher: ‘సిద్ధం’ అంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురుతిరిగితే దాడులు.. అన్నట్టు సాగుతున్న జగన్ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తాడులో జగన్ సభను కవర్ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పెనుదాడి జరిగింది. ఆదివారం జరిగిన ‘సిద్ధం’ సభ కవరేజీకి వెళ్లిన ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రతినిధులే లక్ష్యంగా ముందే దాడికి వైసీపీ మూకలు అంతా ‘సిద్ధం’ చేసుకున్నాయి...
Raptadu Siddam Sabha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది.
అనంతపురం (Anantapuram): టీడీపీ చేపట్టిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోక వర్గంలోని మారూరులో పర్యటించారు.