Home » Raptadu
నాడు-నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అరకొర పనులు చేపట్టి ప్రచారహోరు సాగించింది. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని ప్రకటన లిచ్చారు. ప్రతి పేద సొంతింటి కల నెరవేరు స్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో ముందడుగు వేసి ప్రతి లబ్ధిదారుడికి తానే స్వయంగా ఇల్లు కట్టించి, తాళాలు చేతికిస్తానని చెప్పి... అసంపూర్తిగా ఇళ్లను నిర్మించా రు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరక అప్పులపాలయ్యారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం అని ఎ మ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం మండలం నాయకులతో నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీ రు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు.
రువు జిల్లాలోని రైతులు నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం మండలంలోని రాచానపల్లి గ్రామం వద్దనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు.
సరిగ్గా రెండేళ్ల క్రితం నారా లో కేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని ఎమ్మెల్యే పరిటా ల సునీత పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నారాలోకేశ యువగళం పాదయాత్ర ఆరంభించి న రోజే వైసీపీ పతనం మొదలైందన్నారు.
విద్యార్థులను పస్తులుంచి.. సస్పెండైన చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర వసతిగృహం వార్డెన నారాయణస్వామి.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలలో ‘ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్’గా పురస్కారం అందుకున్నారు.
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశర్రెడ్డి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై సమగ్ర ద ర్యా ప్తు జరపాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. సో ములదొడ్డి సమీపంలో రైలు పట్టాల వద్ద పడిఉన్న ఉమా మహే శ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దివంగత పరిటాల రవీంద్ర వర్ధంతిని నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్లు పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలను బలోపేతం చేయడానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. నూతనం గా ఎంపికైన మండలంలోని ప్యాదిండి గ్రామానికి చెందిన గొర్రెల పెంపకం దారుల సంఘం సభ్యులు సోమవారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని మ ర్యాదపూర్వకంగా కలిశారు.
లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన గృహం సందర్శనకు సంబంధించి విజ్ఞాన విహార యాత్ర పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. నగరంలోని ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విడు దల చేశారు.