Home » Shubman Gill
సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.
సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ( 121*)సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(74*) అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి మ్యాచ్లో ఓడినా ఆసీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ గిల్ అన్నాడు.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైదానంలో తీవ్ర అసహనం ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబుల్ సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో రనౌట్ కావడం జైస్వాల్ను నిరాశలోకి నెట్టింది.
కొందరిని కొన్ని విషయాల్లో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే అలాంటి వాటిని ఓవర్ కమ్ చేసి..ఫస్ట్ టైమ్ విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుంటాది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ విషయంలో జరిగింది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో టీమిండియా జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్లో రోహిత్తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్కు ఆసియా కప్ ఆడే భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదా? ఇంగ్లండ్ పర్యటనలో అమోఘంగా రాణించి పలు రికార్డులు నెలకొల్పిన గిల్ను పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టాప్ స్థానాలు దక్కించుకున్నారు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 784 పాయింట్లతో గిల్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది.
ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ దగ్గరపడడంతో టీమిండియా జట్టులో ఎవరెవరు రాణిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. యంగ్ స్టార్ శుభ్మాన్ గిల్, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్, ఫామ్ పరంగా టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? సెలక్షన్ టీం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తాజా ఇంగ్లండ్ సిరీస్లో పది ఇన్నింగ్స్ల్లో 754 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేసి ఉంటే సునీల్ గవాస్కర్ (771) రికార్డును బద్దలుగొట్టేవాడు. ఆ రికార్డును గిల్ త్రుటిలో మిస్ అయ్యాడు.