Home » Sircilla
కేసీ ఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేశారు.
జిల్లాలోని ఐదు మండలాల్లో జరిగే తొలి విడుత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ విజయం కోసం మిగిలిఉన్న చివరి అస్త్రాలపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ముగి సిన పోలింగ్కు మరో 48 గంటల సమయం ఉండటంతో తమ విజయం కోసం గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం నానా తంటాలు పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. తొలి విడతలో జిల్లాలోని మంథని, కమాన్పూర్, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లోని 99 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల విధులను రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల పరిశీల కులు అనుగు నరసింహారెడ్డితో కలిసి ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమా వేశం నిర్వహించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యా లయంలో సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, అకౌం ట్స్ విభాగాల్లో రికార్డులు తనిఖీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంలో చదువు కున్న యువత గొడవలకు వెళ్లితే పోలీసు కేసుల వుతాయని, దీని వల్ల భవిష్యత్లో ఉద్యోగాలు పొందే క్రమంలో ఇబ్బందులు పడుతారని డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సోమవారం పలు గ్రామా ల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీ లించారు.
రహదారులపై గుంతలను పూడ్చుతూ మంథని పోలీసులు ప్రజలచే శభాష్ అనిపించుకుంటున్నారు... ఇటీవల వరుసగా జరగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసులు దృష్టి సారించారు. పలుచోట్ల బ్లాక్ స్పాట్లను గుర్తించారు. రోడ్డుపై గుంతలతో వాహనాలు అదుపు తప్పి కిందపడి మరణాలు, గాయాలపాలవుతున్నారు.
సుల్తానాబాద్ రైల్యే గేట్ తరుచు మూసి ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. సుల్తానాబాద్ రైల్యే గేట్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో తరుచూ గేట్లు వేసి ఉండడం వల్ల ప్రయాణి కులు, వాహన చోదకులు వేచి ఉండాల్సి వస్తోంది.
ఖేలో ఇండియాతో మారుమూల పల్లెల్లో ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, టోర్నమెంట్ ఆర్గనైజర్ బెజ్జంకి దిలీప్ నేతృత్వంలో నెలరోజులుగా కొనసాగుతున్న క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఆదివారం జరిగింది.
చెంతనే మానేరు వాగు ఉన్నా ఇసుక ధరలు మాత్రం ఆకాశన్నంటాయి. సులభతరమైన ఇసుక పాలసీ తీసుకువచ్చామని చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిదుల మాటలు నీటి మూటలయ్యాయి. ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా ట్రాక్టర్ యజమానులు, ఇసుక వ్యాపారులు సిండికేట్గా మారారు.