Home » Sircilla
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే తిమ్మాపూర్, మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం, శంకరపట్నం మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. దీంతో అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించి, సర్పంచ, వార్డు సభ్యుల అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
పల్లె ఎన్నికల సంగ్రామం ఊపందుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రెండో విడత నామి నేషన్లు ఉపసంహరణ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. మలి విడత అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచారం ఊపందుకోనున్నది.
పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మొదటి విడత పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత గ్రామాల్లో ఈనెల 6వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. మూడో విడత పంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన, అప్పీళ్ల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం కార్యక్రమాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో పూర్తి కానున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఈనెల 9వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపి స్తుండడంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుం టోంది. పోటాపోటీగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయా లంటూ వేడుకుంటున్నారు.
గ్రామ పంచా యతీ ఎన్నికల సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాల యంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భం గా 138 మంది ఎన్నికల అధికారులకు ఎంఇఓ హరిప్రసాద్, రిసోర్స్పర్సన్ అంజనీ ప్రసాద్ ఎన్నికలు ఏ విధంగా నిర్వ హించాలి, ఎన్నికల సామగ్రిపై వివరించారు.
కక్షిదారుల సౌలభ్యం కోసమే రాష్ట్రంలో నూతన కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్లు తద్వారా కేసులు సకా లంలో పరిష్కరించే అవకాశం ఉందని హైకోర్టు జస్టిస్, పెద్దపల్లి జిల్లా ఆడ్మినిస్ట్రేటివ్ జడ్జి లక్ష్మీనారా యణ అలిశెట్టి అన్నారు. సుల్తానాబాద్ కోర్టు ఆవర ణలో ఏర్పాటు చేసిన అదనపు కోర్టును హైకోర్టు జస్టిస్లు లక్ష్మీనారాయణ, పుల్ల కార్తీక్, జె శ్రీనివాస రావులు శనివారం ప్రారంభించారు.
సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రెండు సంవత్సరాలుగా మెడికల్ బోర్డుకు వెళుతున్న కార్మికులను అన్ఫిట్ చేయకుండా యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజాభద్రతలతో హోంగార్డుల పాత్ర కీలకమని, వారి త్యాగాలు, బలిదా నాలు మరువలేనివని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా కమిషరేట్ పరేడ్ గ్రౌండ్ గౌరవ వందనం స్వీకరించారు.
పంచాయతీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మొదటి విడత పోలింగ్ జరిగే కాల్వశ్రీ రాంపూర్ కమాన్పూర్, మం థని, రామగిరి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు.
రామగుండం నియోజకవర్గంలో ఉచిత ఇసుక సరఫరా నిలిచిపోయింది. నాలుగు నెలల క్రితం జిల్లా యం త్రాంగం గోదావరి నది నుంచి ఇసుక తీయకుండా ర్యాంపులకు అడ్డంగా కందకాలు తవ్వింది. ఇసుక పక్కదారి పడుతుందనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ సీరియస్గా స్పందించి గోదావరి నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తీసుకెళ్లే రీచ్లను మూసివేయించారు.