Home » Smriti Mandhana
పెళ్లి రద్దు తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన భారత్ స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి టీమిండియా జెర్సీ ధరిస్తే మనసులో ఇతర ఆలోచనలన్నీ తొలగిపోయి ఆటపై చెదరని ఏకాగ్రత కుదురుతుందని అన్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. ఈ మేరకు ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అందరినీ రిక్వెస్ట్ చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలిసారిగా ఇన్స్టా పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె వేలికి ఉంగరం లేకపోవడం చర్చకు దారి తీసింది.
స్మృతి మందానా పెళ్లి వాయిదా పడిన వారాల తర్వాత పలాశ్ ముచ్చల్ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమమైన 'శ్రీ హిట్ రాధా కేలి కుంజ్' ఆయనను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టాడు.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి పూర్తిగా రద్దు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలన్నింటికీ ‘దిష్టి’ ఎమోజీతో వారిద్దరూ చెక్ పెట్టారు.
అనివార్య కారణాల వల్ల స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్మృతి కోసం బీగ్బాష్ లీగ్కు దూరమైంది. ఈ విషయంపై ప్రముఖ నటుడు సునీల్ శెట్టి స్పందించారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలాశ్ తల్లి అమిత స్పందించారు. అతి త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.
మహిళల బిగ్బాష్ లీగ్కు స్టార్ బ్యాటర్ జెమీమా దూరమైనట్టు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈవో వెల్లడించారు. ఆమె స్నేహితురాలు స్మృతి మంధానకు తోడుగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె.. పలాశ్ ను ఇన్ స్టా లో అన్ ఫాలో చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.