Home » Sports news
గవాస్కర్, టెండూల్కర్, ధోనీ, కోహ్లీ, రోహిత్ తదితరులను క్రికెట్ దేవుళ్లుగా ఆరాధించే మన దేశంలో ఒకప్పుడు మహిళల క్రికెట్పై అంతులేని వివక్ష ఉండేది.
మెల్బోర్న్కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో అతడు కుప్పకూలిపోయాడు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు.
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రాణిస్తున్న శార్దూర్ ఠాకూర్ టీమిండియాలోకి తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ప్రపంచ కప్లో తాను కచ్చితంగా ఆడతానని వ్యాఖ్యానించాడు. యువ ప్లేయర్ హర్షిత్ రాణా పోషిస్తోన్న రోల్ తనదేనని తెలిపాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల తన ప్రియురాలు, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్తో రింకూ నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా వీరి ప్రేమకు సంబంధించిన సీక్రెట్ను రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్ ఓ పాడ్కాస్ట్లో వెల్లడించింది.
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్లో ఓ రెండు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
మహ్మద్ షమీ భారత్ తరఫున చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కన పెడుతున్నారన్న వాదన ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ల్లోనూ చోటు దక్కకపోవడంతో షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కేవలం 66 బంతుల్లోనే 80 పరుగులు చేసిన స్మృతి అనవసర షాట్ ఆడి తన వికెట్ కోల్పోయింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడారు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి గాయమైంది. అయ్యర్ గాయం చాలా సున్నితమైంది కావడంతో ఇప్పుడప్పుడే మైదానంలోకి దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్నకు సన్నాహకంగా ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ కాన్బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.