Home » Student
పోటీ పరీక్షలకు చదువుకుంటున్న ఎస్కేయూ విద్యార్థులు తమకు హాస్టల్ వసతి కల్పించాలని వర్సిటీ యాజమాన్యాన్ని అభ్యర్థించేందుకు బుధవారం పరిపాలనా భవానికి చేరుకున్నారు. విషయం తెలసుకున్న అధికారులు విద్యార్థులను కట్టడిచేసి పరిపాలనా భవనంలోకి రాకుండా తాళాలు వేశారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.
ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్ క్రీక్ జలపాతం వద్ద ఏప్రిల్ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి(23), హైదరాబాద్కు చెందిన రేపాల రోహిత్ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు.
టీఎ్సఎ్పసెట్లో ఇంజనీరింగ్కన్నా వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల వైపే కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులు మొగ్గు చూపారు. ఈసారి అగ్రి, ఫార్మసీ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పరీక్షల కోసం మొత్తం 1,00,254 మంది దరఖాస్తు చేయగా వీరిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 37,205 మంది ఉన్నారు.
Telangana: గత కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికలప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నారు.
న్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో కేవలం 7,819 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6,759 మంది అర్హత సాధించారు. జిల్లాలో వందలోపు ర్యాంకులు ఇద్దరికి మాత్రమే వచ్చాయి. వీరు కూడా ఐఐటీకి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి పాలిటెక్నిక్ చదవాలన్న ధ్యేయంతో ఉన్న ఏ ఒక్కరికీ వెయ్యి లోపు ర్యాంకు రాలేదని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదనేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు అంటున్నారు. ...
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు కలలు కటుంటారు. ముఖ్యంగా అమెరికా వెళ్లి చదవుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. అటువంటి విద్యార్థుల కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్ ఎప్సెట్కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.