Home » Student
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
రాష్ట్రంలో రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, సర్కారు రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లలో చేరేందుకు టాపర్లు ఆసక్తి చూపడం లేదు. ఎప్సెట్లో 100లోపు ర్యాంకు పొందిన వారిలో ఒక్కరు, 200 లోపు ర్యాంకులు వచ్చిన వారిలో ఇద్దరు, 500లోపు ర్యాంకులు సాధించిన వారిలో 12 మంది, వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారిలో 86 మంది మాత్రమే ఇక్కడ సీట్లలో చేరేందుకు అనుకూలంగా ఉన్నారు.
మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని...
రాంచీలోని మెకాన్ లిమిటెడ్... ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2024కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) నేడు (జూలై 18) విచారించనుంది. జూలై 18న సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కారణాల జాబితా ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 40కి పైగా పిటిషన్లను విచారించనుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్ను అందించనుంది.