Home » Student
ఆదివారం రోజున జేఎన్టీయూ(JNTU) బాయ్స్ హాస్టల్లో ఆహారాన్ని పిల్లి తినడంపై యాజమాన్యం స్పందించింది. ఆహారాన్ని పిల్లి తినలేదని అధికారుల బృందం తేల్చిందని ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి(Principal Narsimha Reddy) చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సీ)లో పేర్కొన్న విధంగా ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు ఎన్ని ఇచ్చారు..? చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పాత ఫీజు రీయింబర్స్ మెంట్పై విధివిధానాలు రూపొందించాలని విద్యాశాఖామంత్రి నారాలోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు విధించిన సంగతి తెలిసిందే. బకాయి విడుదల చేయకపోవడంతో ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాలేజీల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
పెన్పహాడ్ మండలం దోసపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నారి మృతి పట్ల పొన్నం సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
నాయుడుపేట(Naidupeta) గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు(Gudur) ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయిన తెలంగాణకు చెందిన సూఫియాన్ త్వరలోనే స్వదేశానికి వస్తాడని అతని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ, చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద దాదాపు రూ.4,769 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పోగయ్యాయి. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు మూడేళ్లుగా రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు చేయలేదు.