Home » Summer
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డుస్థాయిలో పెరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 90 ఎంయూలకు విద్యుత్ వినియోగం చేరింది. ఇదిలా ఉంటే.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Summer Water Tank Cooling Tips: దాదాపు ప్రతి ఇంటికి నీళ్ల ట్యాంకులు మేడపైనే ఉంటాయి. వేసవిలో సూర్యరశ్మికి ప్రతిక్షణం గురయ్యే వస్తువుల్లో ఇదీ ఒకటి. ఇంటి పైకప్పుపై ఉండటం వల్ల ట్యాంకులోని నీళ్లు రాత్రి అయినా సలసల మరిగిపోతూ ఉంటాయి. ఇలా ట్యాంకు వేడెక్కకూడదంటే ఈ టిప్స్ పాటించండి.
Best Time To Eat Mango: మామిడి పండ్ల రుచి తలచుకోగానే ఎవరికైనా నోరూరాల్సిందే. ఎండాకాలంలోనే లభించే మామిడిని రోజూ తినాలనే కోరికతో ఇంట్లో నిల్వ చేసుకునేవారు ఎక్కువే. కానీ, రోజులో ఈ సమయాల్లో మాత్రం ఎప్పుడూ మామిడి పండు తినే సాహసం చేయకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Heat Wave Safety Tips: వేసవి కాలంలో ప్రజలు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. మనం అనుసరించే కొన్ని అలవాట్లు అనారోగ్యానికి కారణమవుతాయి. ఎక్కువ మంది పట్టించుకోకుండా వదిలేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
Tips To Identify Fake ORS: వేసవికాలం కావడంతో ప్రస్తుతం ORS ప్యాకెట్లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో నకిలీలు విచ్చలవిడిగా మార్కెట్లోకి ప్రవహిస్తున్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కాబట్టి నిజమైన, నకిలీ ORS ప్యాకెట్లకు మధ్య తేడాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.
Telangana Heatwave: రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో.. ఎండ తీవ్రత పెరిగింది. గత నాలుగు రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా.. మే నెలలో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతోంది.
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ( జేఎన్టీయూ) సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు మే నెల 4వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే.. కళాశాల తిరిగి జూన్ 2నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు
తెలంగాణలో తీవ్ర ఎండల ధాటికి 11 మంది వడదెబ్బకు మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఈ సీజన్లోనే అత్యధికంగా నమోదైంది.