Home » Supreme Court
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలోని వాయు కాలుష్యం నేపథ్యంలో బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీ కాలుష్య సమస్య ఏంటనేది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఏ ఒక్క కారణంతో ఈ పరిస్థితి రాలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
భూమిపై పనిచేసే ఉగ్రవాదుల కంటే వారిని ప్రేరేపించి పనిచేయిస్తున్న వారు అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 2020లో ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10న ఎర్రకోట పేలుడు ఘటన ఇందుకు నిదర్శనమని వివరించారు.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది.
చిన్నారుల మిస్సింగ్పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారుల మిస్సింగ్ అంశంపై జిల్లాకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని గత విచారణలో సూచించినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూచించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో డూప్లికేట్ పేర్లు, తప్పుడు పేర్లు, అనర్హత కలిగిన ఓటర్లు రిజిస్టరైనట్టు పలు ఉదంతాలు ఉన్నాయని అన్నాడీఎంకే పేర్కొంది.
కేఏ పాల్ మీద సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని మీడియాలో ప్రచారం కోసం వాడుకోవద్దనేలా సూచనలు చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.