Home » Tamil Nadu
పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్కుమార్ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే... రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో.. మళ్లీ ‘అమ్మ’పాలన రావాలని పలువురు నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థమైపోయిందన్నారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఏపీకి చెందిన వారు నలుగురు ఉన్నారు. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో తెలుగు భక్తుడిపై దాడి జరిగింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు స్థానిక వ్యాపారి గాజు సీసాతో దాడి చేశాడు. అంతేకాకుండా..
గత నాలుగు రోజులుగా చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కాస్త తెరపిచ్చాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఇళ్లనుంచి బయటకు కూడా రాలేకపోయారు. అయితే.. కాస్త తెరపివ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రోజుల్లో ప్రేమపెళ్లి బహుకష్టం.. అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. కార్తిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారు ఒకింత నవ్వుకోవడం కనిపించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.
గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన ఊటీలో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రదేశాల్లో ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఊటీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. వాటర్ బాటిళ్లు ఎక్కడా కనిపించవు. అయితే.. పర్యాటకుల కోసం ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు.
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.