Home » Tamil Nadu
కరూర్ ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నుంచి ఎనిమిది మంది నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులకు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.
తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. టీవీకే అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్ను తప్పుబట్టారు. ఈ ర్యాలీకి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని....
తిరుచ్చిలో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కె.సెల్వపెరుంతగై పార్టీ వైఖరిని చెప్పారని, తన అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. అయితే నిన్న, ఈరోజు వార్తాపత్రికలు చదవడం, టీవీలో విజువల్స్ చూసిన తర్వాత అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు.
విజయ్ సభకు 12,000 మంది వస్తారని నిర్వాహకులు చెప్పి తమ వద్ద అనుమతి తీసుకున్నారని, అందుకు తగ్గట్టే పోలీసు సిబ్బంది మోహరించిందని ఏడీజీపీ చెప్పారు. అయితే విజయ్ సాయంత్రం 6 గంటలకు రావడంతో జనం ఒక్కసారిగా దూసుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని ఆయన తెలిపారు.
టీవీకే న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు ఎస్.అరివాళగన్ సారథ్యంలోని కొందరు అడ్వకేట్లు ఆదివారంనాడు గ్రీన్వేస్ రోడ్డులోని జస్టిస్ ఎం.దండపాణి నివాసానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయంగా కరూర్ విషాద ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
తమిళ హీరో విజయ్ నిన్న కరూర్ లో తీసిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎన్నో విషాద ఘటనలు. తమ బిడ్డల్ని చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిన్న (శనివారం) కరూర్లో నిర్వహించారు. అయితే, ఈ రోడ్షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.
తమిళ సూపర్స్టార్, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షో భారీ విషాదానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో గోడ కూలిన ఘటనతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో అభిమానులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.