Home » TDP
ఏపీలో పోలింగ్ ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన..
పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.
పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నిబంధనలను తుంగలో తొక్కుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదంటే కార్యకర్తలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. నరసరావుపేట పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హల్ చల్ చేశారు.
Andhrapradesh: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతోంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు హల్చల్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న మద్దలచెరువులో పోలీసులు వైఫల్యం చెందారు. కేవలం ఒక్క హోంగార్డును మాత్రమే ఎన్నికల విధులకు కేటాయించారు.
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల పోలింగ్ అనేక ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలింగ్ మొదలవక ముందు నుంచే వైసీపీ నేతల దౌర్జన్యాలు బయటబడ్డాయి. టీడీపీ నేతలపై దాడులు, కిడ్నాప్లు, బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు తాజాగా వెలుగు చూశాయి. యాదమరి మండలం కసిరాళ్ల ,కోడిగుట్ట పోలింగ్ కేంద్రాల బయట వైసిపి ఓటర్లను మభ్యపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్న వైనం. పూతలపట్టు మండలం సంజీవరాయని పల్లి పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి చోటు చేసుకుంది.
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో నలుగురు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా.. మిగతా వారు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు. బ్యాలెట్లో మొత్తం 16 క్రమ సంఖ్యలు ఉండగా.. మొదటి1 5 అభ్యర్థులకు సంబంధించినవి, 16వ క్రమసంఖ్య నోటాను సూచిస్తుంది.