Home » Team India
టీమిండియాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్లో భారత్ను ఓడించడం కష్టమేనని.. కానీ మేం ఈసారి సిరీస్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టాస్ ఓడిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు లాహిరు సమరకూన్(14 బంతుల్లో 52), కెప్టెన్ మధుశంక(15 బంతుల్లో 52) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగారు. అనంతరం 139 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచరీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లోనూ మరో శతకం చేశాడు.
2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించింది. తాజాగా దుబాయ్లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయని ఆ కథనంలో పేర్కొన్నాయి.
భారత-ఏ జట్టును ప్రకటించే ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలు వార్తలు వచ్చాయి. అనధికారిక వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వలేదు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో జరిగిన ఇంటరాక్షన్లో శ్రీ చరణి.. తన క్రికెట్ ప్రయాణం గురించి పంచుకుంది. క్రికెట్ ఆడేందుకు పరీక్షలు రాయనని తరుచు బెదిరించేదానని తెలిపింది.
మహిళల ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.
ఆసియా కప్లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు హారిస్ రవూఫ్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, ఫర్హాన్లపై కూడా జరిమానాలు విధించారు.