Home » Teenmaar Mallanna
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు (Harish Rao) అన్నారు.కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని ఆరోపించారు. రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చాడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నించారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్లాక్ మెయిలర్ తీన్నార్ మల్లన్న కావాలో.. బీఆర్ఎస్ గోల్డ్ మెడల్ ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలో ఆలోచించుకోవాలని అన్నారు.
తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలువరించిన నాలుగు స్థానాలు కాకరేపుతున్నాయి. మాకు కావల్సిందంటే.. మాకు కావాల్సిందేనంటూ బడా నేతలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. నేడు తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు..