Home » Telangana BJP
తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం బీసీలను మరోసారి మోసగించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్రెడ్డి సర్కార్కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు శుక్రవారం రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానా స్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్రెడ్డి ఉద్గాటించారు.
జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రావాళ్లేనని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్రెడ్డి అల్లుడిది ఆంధ్రా అని రాకేష్రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్ సీరియల్గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.