• Home » Telangana BJP

Telangana BJP

Ramachandra Rao:  బీసీలకు కాంగ్రెస్ అన్యాయం.. రామచందర్‌రావు ఫైర్

Ramachandra Rao: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం.. రామచందర్‌రావు ఫైర్

తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.

Laxman: మరోసారి బీసీలని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. లక్ష్మణ్ ఫైర్

Laxman: మరోసారి బీసీలని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.. లక్ష్మణ్ ఫైర్

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో తీర్మానం చేయడం బీసీలను మరోసారి మోసగించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదని, బీసీల జీవితాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ ఆస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister Ponnam Prabhakar: మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Minister Ponnam Prabhakar: మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం త‌ప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Andela Sriramulu Yadav: బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ

Andela Sriramulu Yadav: బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు శుక్రవారం రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు. అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానా స్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు.

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Mahesh Goud: తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

Mahesh Goud: తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా అని మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

BJP MLA Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

BJP MLA Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రావాళ్లేనని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌‌రెడ్డి ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడిది ఆంధ్రా అని రాకేష్‌‌రెడ్డి పేర్కొన్నారు.

MLA Raja Singh: బీజేపీ అధ్యక్ష పదవి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

MLA Raja Singh: బీజేపీ అధ్యక్ష పదవి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.

BJP MP Laxman: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

BJP MP Laxman: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం కమిషన్ సీరియల్‌గా నడుస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏడాది కాలం నుంచి సాగదీస్తున్నారని విమర్శించారు. అసలు ఈ కేసులపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి