Home » Telangana Police
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
పోలీస్ వ్యవస్థపై నిజమైన అభ్యంతరాలు ఉంటే, వాటిని బహిరంగంగా దూషించడం కాకుండా చట్టబద్దంగా లేవనెత్తాలని ఐపీఎస్ అధికారుల సంఘం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సూచించింది. DGP మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్లో ఈసీ నిబంధనలు అతిక్రమించారనే కారణంతో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారని పోలీసులు పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో వివిధ పోలింగు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
హైదరాబాద్లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.