Home » Telangana
రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 14న జరిగే పోలింగ్ ప్రక్రియ ముగింపు సమయం మధ్యాహ్నం 1 గంటల వరకు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో జరుగనున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం నిబంధన అమలులో ఉంటుందని, ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాల్లో నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఆదరించారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్లన్ని మూగబోయాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ గత నెల 30నుంచి ఈ నెల 2వరకు కొనసాగింది. ఆపై నామినేషన్ల స్కూృట్నీ, ఉపసంహరణలు, తుదిజాబితా ప్రకటన పూర్తయిం ది. సరిగ్గా ఆరు రోజుల పాటు గ్రామాల్లో ఇంటిం టికి తిరిగి ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు, వారి బందుమిత్రులు మద్దతు ఇచ్చిన ప్రధాన పార్టీల నాయకులు చివరి మూడు రోజులు గెలుపు తమ భుజస్కందాలపై వేసుకొని ముఖ్యగ్రామాలు తిరి గిన రాజకీయ పెద్దలు శుక్రవారం సాయంత్రంతో ప్రచారాలు ఆపేశారు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్ బండారం బయటపడింది. గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడికి పాల్పడిన ప్రొఫెసర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.