Home » Telugu Desam Party
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదం కేసు పక్కదారి పట్టిందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) ఆరోపించారు. వాస్తవాలు బహిర్గతం కావాలని అందరూ కోరుకుంటారని కానీ విచారణ పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు.
జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.
‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుందా..? ఇప్పుడిదే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ (YSRCP) హడావుడి చేస్తుండగా.. కూటమి (NDA Alliance) మాత్రం పోలవరం, అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సరిగ్గా..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) పోల్చుకుంటే గోబెల్స్ కూడా సరిపోడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!