Home » Telugu Desam Party
Madhavilata Cyber Complaint: జేసీ ప్రభాకర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ 31న తాడిపత్రిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం ఈ స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ను బీజేపీ నేత మాధవిలత తప్పుపట్టారు. అప్పటి నుంచి వీరిమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Denduluru Politics: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో చింతమనేని ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ వివాదంలో చింతమనేని డ్రైవర్, గన్మ్యాన్లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడ్డారు.ఈ దాడితో అబ్బయ్యచౌదరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
Vamsi Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు.
YCP vs TDP: ఏలూరు జిల్లాలో మరోమారు వైసీపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు పార్టీల వారిని శాంతపరిచారు.
KA Paul Sensational Comments On AP Deputy CM Pawan : పవన్ కళ్యాణ్పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి ఓటు బ్యాంకు లేదని తీవ్రంగా విమర్శించారు.
YS Jagan:పులివెందులలో వైఎస్ జగన్కు చెక్ పెట్టేలా తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రజల్లో బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఢీకొట్టేలా పావులు కదుపుతోంది.
Prathipati Pulla Rao: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీని దోచేసి అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.
GV Anjaneyulu: మాజీ సీఎం జగన్పై అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి రాకుండా జగన్ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు.