Home » Telugu Desam Party
Minister Gummadi Sandyarani: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.అబద్ధాల్లో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే... అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.
Alapati Rajendra Prasad: జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం కలిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ వ్యవస్థలను అన్నిటిని నిర్వీర్యం చేసి విధ్వంసక పాలన సాగించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
Payyavula Keshav: వైసీపీ అధినేత జగన్కు మతి భ్రమించిందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజకీయంగా పబ్బం గడపడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని అన్నారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలి పోతాయని విమర్శించారు.
Minister BC Janardhan Reddy: వైసీపీపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలోె అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.
Sana Satish: ముద్రగడ పద్మనాభరెడ్డి, వైసీపీపై తెలుగుదేశం ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి డ్రామానే అని ఆరోపించారు. ఈ దాడి వైసీపీ చేయించినట్లుగా ఉందని సానా సతీష్ అనుమానం వ్యక్తం చేశారు.
Minister Ravikumar: జగన్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Minister Anagani Sathya Prasad: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళంపేట అటవీ శాఖ భూ ఆక్రమణలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుందని తేల్చిచెప్పారు.అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
TDP Politburo Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లేలా కార్యచరణ చేపట్టారు.
Nara Lokesh:సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం ఏడు నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు.