Home » terror attack
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్ హుస్సేన్ రాణా(63)ను భారత్కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఐఎ్సఐఎస్ ఉగ్రవాది దేశరాజధానిలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ నెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ సమీపంలో ...
జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్సభలో తెలిపింది.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో జూన్ నుంచి పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోవడం, కొండప్రాంతం జిల్లాలో తిరిగి తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుష్పపన్నాగాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యాయి. టెర్రరిజంపై కొరడా ఝుళిపిస్తూ ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను శనివారంనాడు విడుదల చేశారు. వీరి ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు.
బాలీవుడ్ చిత్రం 'ఫాంటమ్' పోస్టర్తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సోమవారంనాడు విడుదల చేసిన ఓ ఆడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు.
పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అయితే ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో కీలక విషయాలు బయటకి వచ్చాయి. సరిహద్దులో ఉన్న టెర్రరిస్టు శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.