Home » terrorist
జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టాయి.
కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా ఫ్రిసాల్ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...
భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్ ప్రకటించారు.
రష్యాలో ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి ఉత్తర కాకసస్ రీజియన్లోని డాగెస్థాన్ నగరంలో రెండు చర్చిలు, యూదులకు చెందిన ఐదు ప్రార్థన మందిరాలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్, బంగ్లాదేశ్ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళి అర్పించింది. మంగళవారం పార్లమెంటులో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఓ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని...
మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్గా ఇజ్రాయెల్ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.