Home » TG Govt
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు కమిషన్లకు చైర్మన్లను ప్రకటించింది.
ప్రైవేట్ ఆస్పత్రులకు పోటీగా ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు(శుక్రవారం) నూతనంగా రూ. 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావు పెడతారా ? అని నిలదీశారు. తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన పనులను వెంటనే చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ కలెక్టరేట్లో ఈరోజు(శుక్రవారం) దిశా కమిటీ మీటింగ్ జరిగింది.
ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక సీఎంకు లేదా ? అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు(గురువారం) రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథస్సుకు ప్రాధాన్యత ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఏఐ ఉండాలి హైదరాబాద్ Ai క్యాపిటల్గా ఎదగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయొచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.