Home » TG Govt
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నింటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టుకుంటామని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పరిగె(పోచారం) శ్రీనివా్సరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు(క్యాబినెట్ హోదా)గా నియమితులయ్యారు.
ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు..
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న ప్రభుత్వం.. రూ.2 లక్షలకు మించి తీసుకున్న రుణాల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.
రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా, తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి(టర్మ్) నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సగటు కాల పరిమితి 10-12 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 19 ఏళ్లకు పెరిగింది.
కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్కు చేరుకున్నారు.
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.