Home » TG News
ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి....
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కేజీ బెండకాయలు రూ. 20 నుంచి 40 వరకు అమ్మగా.. ప్రస్తుతం రూ. 55కు విక్రయిస్తున్నారు. అలాగే దొండకాయను రూ. 40కి విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...
31 అర్ధరాత్రి, నూతన సంవత్సన వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం 120 ప్రాంతాల్లో 7 ప్లటూన్ల పోలీసులు గస్తీలు నిర్వహించేలా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 150 వార్డులుండగా.. దానిని ప్రస్తుతం 300 వార్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా.. కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య నియంత్రణ, ఆర్ధిక వెసులుబాలో భాగంగా నగరంలో మరిన్ని ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాండేడ్-కాకినాడ మార్గంలో, అలాగే కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు, నాంపల్లి రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.