Home » TG News
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షానికి బంజారాహిల్స్ రోడ్నెంబర్-11(Banjara Hills Road No-11)లోని ఉదయ్నగర్ కాలనీలో నాలా రిటైనింగ్ వాల్ కూలింది. దీంతో పక్కనున్న రోడ్డు కుంగడంతో పాటు.. ఆ రహదారిపై పార్క్ చేసిన వాహనాలు, నాలాకున్న ఫెన్సింగ్.. వరద నీటిలో కొట్టుకుపోయాయి.
‘నమస్తే.. బాస్. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య భారీ వర్షం(Heavy rain) కురిసే అవకాశముందని, ఆ సమయంలో ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి సూచించారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువల భారీగా పెరిగాయని, కానీ.. అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలో ఎర్రటి ఎండలే కాయగా.. 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడింది. యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటేశ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీ్సగఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..
హైటెక్సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఆ రహదారిపై రాత్రి వేళ రాకపోకలు సాగించాలంటే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలకు వణికిపోతున్నారు. చీకటి పండిందంటే చాలు.. మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
ఓట్లేసేందుకు రెండు రోజుల ముందుగానే ప్రజలు వెళ్లడంతో నగరంలో వాహనాల రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. దీంతో సాధారణ రోజులతో పోల్చితే పోలింగ్ రోజున, ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత వాయు కాలుష్యం తగ్గినట్లుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.