Home » TG Politics
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్లో సమావేశం కానున్నారు. కేసీఆర్తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ అని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా పాపాలు పోవని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు.
వైద్య సేవలు అందించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా ఫైయిల్ దని ధ్వజమెత్తారు.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ఓటు హక్కును హరిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఉద్ఘాటించారు.
తెలంగాణలో ఓటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజల ఓట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో మీరెలా గెలిచారని బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప మఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బృందం బిజీ బిజీగా ఉంది.
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే.. 42శాతం పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. రేవంత్రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడితే.. తెలంగాణ నంబర్ వన్ అయ్యేదని.. మెట్రో ఫేజ్- 2 వచ్చేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
కడియం శ్రీహరికి ఘన్పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ కాదని.. దేశ్ముఖ్ అని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆరోపించారు. బీసీల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు అని ఆక్షేపించారు.