Home » TG Politics
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం కిషన్ రెడ్డి స్థాయికి తగదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరతపై వాస్తవాలు దాచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు.
తనని నమ్ముకున్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తన అడుగుటు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరించారు. చట్టాలను గౌరవించే వ్యక్తిని.. చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కోర్ట్ తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో చర్చలు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దె చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై చర్చలు కొనసాగానున్నాయి
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి సీతక్క ఉద్ఘాటించారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కాంగ్రెస్ థార్థ్ క్లాస్ పార్టీ అన్న వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉండి... ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్కు ప్రపంచపటంలో ప్రత్యేక స్థానముందని, 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు.