Home » TG Politics
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, మజ్లిస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని నిలదీశారు. ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ చేసే ప్రయత్నం చట్ట వ్యతిరేకమని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు.
రేవంత్రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి కోసం ఎదురుచూసిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావులకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .