Home » TG Politics
దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.
రేవంత్రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
మీనాక్షి నటరాజన్ని ఇవాళ తాను కలిశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ పెద్దలతో చెప్పానని కొండా సురేఖ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీన్సియర్ కాంగ్రెస్ వాదినని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ బిహార్లో ఓటు చోరీ అంటున్నారని... జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మాత్రం ఓటు చోరీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు.
కేసీఆర్ ఫొటో లేకుండానే కవిత యాత్ర చేస్తామన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకార్యాలు కలిపించాలని సూచించారు.
హైదరాబాద్కు చెందిన ఐపీఎస్ అధికారి పూరణ్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆరోపించారు.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.