Home » TG Politics
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నేతలు కలిసి స్థానిక ఎన్నికలని అడ్డుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని తనపై కొంతమంది విమర్శలు చేసున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్కుమార్ యాదవ్ నిలదీశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు