Home » TGSRTC
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకం తెలంగాణలో సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకం కారణంగా.. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
కొత్తగా 10 ఆర్టీసీ డిపోల ఔటర్రింగ్ రోడ్డు లోపల శివారు ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ సన్నద్ధం అవుతోంది. మేడ్చల్, రంగారెడి, సంగారెడ్డి జిల్లాల్లో కొత్త డిపోలు ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది.
సద్దుల బతుకమ్మ ఈనెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.
గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ ఆర్టీసీ తోడ్పాటు అందించనుంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన కార్నియాలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో లాభాల బాటలో పయనిస్తున్న టీజీఎ్సఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైనా దృష్టిసారిస్తోంది.
ఐటీ కారిడార్లో ఎలక్ర్టిక్, మెట్రో డీలక్స్ బస్సులను ప్రముఖ ఐటీ సంస్థలకు అద్దెకిచ్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు వినియోగిస్తే ఐటీకారిడార్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
ఆర్టీసీ బస్ డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో సెల్ఫోన్లు వినియోగించకుండా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఆర్టీసీలోని కొందరు అధికారుల తీరు ప్రయాణికులపై అదనపు భారం మోపుతోంది. పల్లె వెలుగు బస్సులకు ఇష్టానుసారంగా ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి తిప్పుతూ ప్రయాణికుల నుంచి ఆమేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.
వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్కు వెళ్లే 89 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.