Home » Tirumala Tirupathi
‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల నారాయణగిరి షెడ్లలో రెండు కుటుంబాల మధ్య గొడవ కారణంగా మహిళలు జుట్టు పట్టుకుని గొడవపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టింది.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనం కోసం సిఫార్సు లెటర్స్ మే 1 నుండి జూన్ 30 వరకు రద్దు అని వస్తున్న వార్తలపై టీటీడీ పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
వేసవి రద్దీతో తిరుమలలో భక్తులు భారీగా తరలివచ్చారు, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.క్యూకాంప్లెక్స్లు, షెడ్లు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం దాకా విస్తరించింది
వరుసగా మూడు రోజుల సెలవులు. ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడి కావడం.. ఈ క్రమంలో తిరుమలలో నెలకొన్న రద్దీ ఆదివారమూ కొనసాగింది.
వేసవి సెలవులు, వారాంతం కారణంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, టోకెన్లు కలిగిన భక్తులు కూడా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు